![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -15 లో... ప్రతాప్ దగ్గరికి భూషణ్ వస్తాడు. ఈ డాక్యుమెంట్స్ పై మహా సంతకం పెట్టాలని అంటాడు. మహాకీ ఇష్టం లేకున్నా డాక్యుమెంట్స్ పై సంతకం చేస్తుంది. చక్రి వంక రిజిస్ట్రేషన్ ఆపుతాడని ఆశగా చూస్తుంది. భూషణ్ వెళ్ళిపోతున్నాడు.. కొంచెం అక్కడ వరకు వెళ్ళమని ప్రతాప్ అంటాడు. మహా నీ డ్రెస్ సెన్స్ నచ్చలేదు.. సో నువ్వు చేంజ్ చేసుకోవాలనగానే మహా కోపంగా సరే అంటుంది.
భూషణ్ వెళ్తుంటే చక్రి కాలు అడ్డుపెడుతాడు. దాంతో భూషణ్ పడబోతాడు.. చూసుకోవాలి కదా అని చక్రిపై భూషణ్ కోప్పడుతాడు. దాంతో మహా నువ్వుకుంటుంది. చూసారా పెళ్లి కొడుకుని ఎలా చేసానో అని చక్రి అనగానే పెళ్లిని ఆపాలి పెళ్లి కొడుకుని కాదని మహా అంటుంది. ఆ తర్వాత మాధవ, కేశవ, కన్నా దగ్గరికి చక్రి వచ్చి భూషణ్, మహా ఫోటో చూపించి బంగారం లాంటి అమ్మాయిని వాడికి ఇచ్చి చేస్తున్నారని చక్రి చెప్తాడు. ఆ తర్వాత మాధవని అక్కడ నుండి పంపించి.. కన్నా, కేశవకి భూషణ్ ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చెప్తాడు చక్రి.
మరొకవైపు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అంకుల్ అని భూషణ్, ప్రతాప్ కి ఫోన్ చేసి చెప్తాడు. మహా అయిష్టంగా రెడీ అవుతుంది. ఆ తర్వాత భూషణ్ వాళ్ళ పేరెంట్స్ ప్రతాప్ దగ్గరికి వచ్చి భూషణ్ ని ఎవరో కిడ్నాప్ చేశారని.. భూషణ్ దారిలో ఆగి పూలదండలు తీసుకొని రావడానికి వెళ్తుంటే.. కొంతమంది వచ్చి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్లారని వాళ్ళు చెప్పగానే అందరు షాక్ అవుతారు. మహా మాత్రం మనసు లో హ్యాపీగా ఫీల్ అవుతుంది. హమ్మయ్య మహా దగ్గర మాట నిలబెట్టుకున్నానని చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |